2 February 2016
Hyderabad
సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్`. `బాహుబలి` ఫేమ్ ప్రభాకర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా జవేరి కథానాయిక. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``మా సినిమా తొలి షెడ్యూల్ను అరకు, ఒడిశాలో 25 రోజులు చిత్రీకరించాం. రెండో షెడ్యూల్ను జనవరి 20 నుంచి 30 వరకు వికారాబాద్లో చేశాం. వికారాబాద్లోని బస్ డిపో, బస్టాండు, ఫారెస్ట్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. మూడో షెడ్యూల్ను ఈ నెల 20 నుంచి మార్చి 5 వరకు చిత్రీకరిస్తాం. దాంతో ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మిగిలిన ఆ పాటను ఔట్డోర్లో చిత్రీకరిస్తాం. సినిమా మొత్తం పూర్తి చేసి వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సుమంత్ అశ్విన్ కెరీర్లో పూర్తి భిన్నమైన సినిమాగా నిలుస్తుంది.` బాహుబలి` ప్రభాకర్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులూ, చేర్పులూ చేసి తెరకెక్కిస్తున్నాం. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలున్న చిత్రమిది`` అని తెలిపారు.
నాజర్, ధనరాజ్, `షకలక` శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: `డార్లింగ్` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: కె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను.