pizza
Sachiin J Joshi announces 15 lacs for Hudhud cyclone relief fund
You are at idlebrain.com > news today >
Follow Us

17 October 2014
Hyderabad

తుపాను బాధితులకు 15 లక్షల విరాళం ప్రకటించిన హీరో సచిన్ జోషి

ఇటీవలే నీ జతగా నేనుండాలి వంటి చిత్రంతో మంచి విజయం అందుకున్న హీరో సచిన్ జోషి తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తనను ఆమితంగా అభిమానించే తెలుగు వారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు. తుపాను రూపంలో వచ్చిన ఇలాంటి విపత్కర పరిస్థితిని మీడియాలో చూసి తట్టుకోలేకపోయానని ఆయన అన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం 15 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉత్తారాంధ్ర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved