రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా శివమ్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ను ఇచ్చారు. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ స్రవంతి మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. స్రవంతి రవికిశోర్ నిర్మాత. కృష్ణచైతన్య సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నానాయికగా నటించింది. ఇటీవలే హైదరాబాద్లో పాటలను కూడా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో విడుదలైన పాటలకు సర్వత్రా మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ''ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశాడు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కించాడు. సెన్సార్ పూర్తయింది. యు/ఎ వచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల చేస్తున్నాం '' అని చెప్పారు. .బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.