11 January 2014
Hyderabadd
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా 'పిజ్జా' ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా
'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తతండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులోకి అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది.
ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి మాట్లాడుతూ - "తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం" అని చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ - ''తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారు. మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నగర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. యువతరాన్ని ఆకట్టుకునే కథ. మా కాంబినేషన్లో వచ్చిన 'పిజ్జా' ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 'పిజ్జా' అద్భుతమైన చిత్రమని, మిస్ అవ్వకుండా చూడాలని అప్పట్లో సిద్ధార్ధ్ తన ట్విట్టర్ లో పెట్టారు. ఇప్పడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.
బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.