|
|
Smita donates food
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సహకారంతో 82,360 మందికి అన్నదానం చేసిన పాప్ సింగర్ స్మిత
|
|
You are at idlebrain.com > news today > |
|
28 April 2020
Hyderabad
పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుత సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బృందం సహకారంతో ఆమె ఇప్పటివరకూ 82,360 మందికి అన్నదానం చేశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేశారు. "సజ్జనార్ సర్.. మిమ్మల్ని కలుసుకోవడం, గత 30 రోజులుగా మీ బృందంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ టీమ్ ద్వారా ఇప్పటివరకూ 83360 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు మీ సూచన మేరకు నిత్యావసరాలను అందించే పని ప్రారంభిస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఆమె 'టీమ్ అలై', 'టీమ్ బబుల్స్' హ్యాష్ట్యాగ్లను జోడించారు.
|
|
|
|
|
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved
|