బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో చిత్ర గీతాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ మనసుకు ఎన్నో అద్భుతాల్ని సృష్టించే శక్తి ఉంది. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నదే ?అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు పూర్వ జన్మస్మృతులు గుర్తుకువస్తాయి? ఆ తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది? కొందరు వ్యక్తులు ఆమెను వెంటాడుతుంటారు? వారెవరు? ఆ సమస్యల వలయం నుండి శ్రీవల్లీ ఎలా బయటపడింది? అనేది ఉత్కంఠను కలిగిస్తుంది. ఎరోటిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. సైన్స్, ప్రేమ, యాక్షన్ అంశాల సమాహారంగా సాగే చిత్రమిదని, ఇటీవలే విడుదలైన టీజర్కు చక్కటి స్పందన లభిస్తోందని, త్వరలో
ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రాజ్కుమార్ బృందావనం పేర్కొన్నారు. రాజీవ్కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సునీత.