25 June 2016
Hyderabad
నాని హీరోగా నటించిన తాజా చిత్రం `జెంటిల్మన్`. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. 'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా హీరోయిన్ సురభి సినిమా గురించి పాత్రికేయులతో మాట్లాడారు....
నేను తమిళంలో యాక్ట్ చేసిన వేళ ఇల్లాద పట్టదారి సినిమా తెలుగులో రఘవరన్ బి.టెక్ అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను నాని చూశాడు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ నచ్చడంతో తనే ఈ సినిమాకు ఇంద్రగంటిగారికి నా పేరు సజెస్ట్ చేశాడు. దాంతో ఇంద్రగంటిగారు కూడా ఆ సినిమా చూసి నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. సినిమా చిత్రీకరణ సమస్యలో నాకు, నివేదకు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒకరికొకరం మా సినిమాలు గురించి మాట్లాడుకునేవాళ్ళం. అప్రిసియేట్ చేసుకునేవాళ్ళం. ఇద్దరి క్యారెక్టర్స్కు ప్రాముఖ్యత ఉంది. దేనికున్న ప్రాముఖ్యత దానికుంది. రఘువరన్ బి.టెక్, బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఇప్పుడు జెంటిల్ మన్ సినిమాలు అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. నాకు నచ్చే కథలను, నప్పే క్యారెక్టర్స్ ఎంచుకుంటాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను బాగా ఆదరిస్తుంది. నాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. నానితో వర్క్ చేయడం ఎంతో బావుంటుంది. తనెంతో సపోర్టింగ్ గా ఉంటుంది. తను వరుస విజయాలు అందుకుంటున్నాడు. తన పెర్ ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్ మెంట్ ఇవ్వగల నటుడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’’ అన్నారు.