pizza
Sushanth donates ₹2 Lakhs to CCC
సీసీసీ'కి హీరో సుశాంత్ విరాళం రూ. 2 ల‌క్ష‌లు
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2020
Hyderabad


షూటింగ్‌లు నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆదాయం లేక ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి ఏర్పాటు చేసిన 'క‌రోనా క్రైసిస్ చారిటీ'కి హీరో సుశాంత్ రూ. 2 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయ‌న తెలియ‌జేశారు. సోమ‌వారం ఆయ‌న, "ఇవి ఒక‌రినొక‌రు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ స‌మ‌యంలో దిన‌స‌రి వేత‌నంతో జీవ‌నం సాగించే సినీ కార్మికుల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 ల‌క్ష‌లు క‌రోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తాన‌ని విన‌మ్రంగా తెలియ‌జేస్తున్నా. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా" అని ట్వీట్ చేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved