12 February 2018
Hyderabad
మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఫిబ్రవరి 10 సాయంత్రం అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలో బెడ్ఫోర్డ్ నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ పాలకమండలి సభ్యులు శశి కాంత్ వల్లిపల్లి, శ్రీనివాస్ కొల్లిపర, శ్రీనివాస్ బచ్చు, మణిమాల చెలుపాది, సీతారాం అమరవాది, మూర్తి కన్నెగంటి, రామకృష్ణ పెనుమర్తి, శంకర్ మగపు, పద్మ పరకాల, చంద్ర తాళ్ళూరి మరియు తదితర కమిటి సభ్యులు పాలుపంచుకున్నారు.