15 October 2014
Hyderabad
హుదూద్ బాధితులకు దర్శకుడు త్రివిక్రమ్ రూ.10 లక్షల సాయం
హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధితులకు తెలుగు సినీ హీరోల అభిమానులతో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాయం చేయాలని ఆయన కోరారు. తమకు ఎంతో ఇష్టమైన విశాఖపట్నం రూపురేఖలన్నీ మారిపోయాయని...ఉత్తరాంధ్ర తొందర్లోనే కోలుకోవాలని ఆయన ఆశించారు.