01 March 2016
Hyderabad
శ్రీ విష్ణు, చిత్ర శుక్లా జంటగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బలగ ప్రకాష్ రావు నిర్మిస్తోన్న ఈ చిత్రంతో పరుశురాం(బుజ్జి), మార్తాండ్. కె. వెంకటేష్ వద్ద దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాల్లో సహాయకుడిగా పనిచేసిన కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవల వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ పూర్తిచేశాం. పాటలతో పాటు కొంత టాకీపార్ట్ పూర్తిచేశాం. కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది.నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల వారు ఆశించే నవ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. కథలోని ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి. త్వరలోనే రెండో షెడ్యూల్ని ప్రారంభిస్తాం’ అని తెలిపారు.
శ్రీవిష్ణు, చిత్రశుక్లా, శివన్నారాయణ, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: తమశ్యామ్, ఆర్ట్: సాయి సురేష్, పాటలు: శ్రీమణి, నిర్మాత:బలగ ప్రకాష్రావు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కుమార్.