20 September 2014
Hyderabad
సాయిరామ్ శంకర్ హీరోగా తమిళ సూపర్స్టార్ శరత్కుమార్ ప్రధాన పాత్రలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఇటీవలె ఓ సినిమా ప్రారంభమైన విషయం విదితమే.యర్రం వంశీధర్రెడ్డి సమర్ఫణలో దేపా శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సాయిరామ్ శంకర్ సరసన రేష్మిమీనన్ నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్లో తోలి షెఢ్యూల్ను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నా లుక్ ,క్యారెక్టరైజేషన్ ,కధ,కధనం ఇలా ప్రతి అంశంలోనూ వైవిధ్యతకు ప్రాదాన్యతనిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపోందించనున్నారు.మంచి కంటెట్కు తగ్గట్టుగానే టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ ఈ మూవీకి లభించిందన్నారు.
శరత్కుమార్ మాట్లాడుతూ..కంటిన్యూస్గా తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా..కేవలం దర్శకుడు సుదర్శన్ చెప్పిన కధ,అందులో నా పాత్రచిత్రణ ఎంతగానో నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కు,టెక్నిషియన్స్కు మంచి పేరును తీసుకువస్తుందన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఓ పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సాయిరామ్శంకర్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుంది.శరత్కుమార్ గారి రోల్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది.రెండు విభిన్నమైన పవర్ఫుల్ రోల్స్లో శరత్గారు కనిపిస్తారన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న చిత్రీకరణ ప్రారంభించాము. కంటిన్యూస్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాము.హీరో సాయిరామ్ కెరీర్లో ఇదేక క్రేజీ మూవీగా నిలుస్తుంది.మంచి స్క్ర్రిప్ట్ కుతోడు టాలెంటెడ్ టెక్నిషియన్ల కలయికలో అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు.
ఎంఎస్.నారాయణ,కాశీ విశ్వనాధ్,తాగుబోతు రమేష్,పృద్వీ, వైవా హర్ష ,మధునందన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్దార్ద్ ,సంగీతం: మహత్ నారాయణ్.ఆర్ట్