|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
30 April 2019
USA
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంగరంగవైభవంగా రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో నిర్వహించే తెలుగు సంబరాలు ఈసారి డాలస్ వేదికగా జరగనున్నాయి. ఈ సంబరాలకు సన్నాహకంగా అమెరికాలోని పలు నగరాల్లో నాట్స్ సంబరాల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ విభాగం చేపట్టిన సంబరాల ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. హ్యూస్టన్ నాట్స్ సభ్యులు, నగరంలోని వివిధ సంఘాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాలస్ నాట్స్ విభాగ సభ్యులు విచ్చేసి సంబరాల వివరాలు, విశేషాలు హ్యూస్టన్ వారితో పంచుకున్నారు. తెలుగువారంతా సంబరాలకు రావాలంటూ అందరిని ఆహ్వానించారు.
ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంగీత, నాట్య ప్రదర్శనలు అందరిని అలరింపజేశాయి . తన మాటల చతురతతో వ్యాఖ్యాత , శైలజ గ్రంధి , కమనీయమైన గానంతో కార్తీక్ అందరిని అలరింపజేశారు. ఈ సందర్భంగా నాట్స్ సౌత్ సెంట్రల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల సంబరాలు గురించి , వివిధ స్పాన్సర్ ప్యాకేజీల గురించి విపులంగా వివరించారు. నాట్స్ హ్యూస్టన్ విభాగ కోఆర్డినేటర్, శ్రీనివాస్ కాకుమాను హ్యూస్టన్ నాట్స్ చేస్తున్న వివిధ సేవ కార్యక్రమాల గురించి అందరితో పంచుకున్నారు. అందరిని డల్లాస్ సంబరాలకి తప్పకుండా రమ్మని ఆహ్వానించారు.
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు రాము ఉప్పలపాటి, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ట్రస్టీ జగపతి వీరాటి, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ తోట, కార్యవర్గ సభ్యులు, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు అఫ్ డైరెక్టర్, శ్రీధర్ కంచనకుంట్ల, ఐటీసర్వ్ హ్యూస్టన్ అధ్యక్షులు నరేందర్ మొండలరెడ్డి , ప్రముఖ హ్యూస్టన్ గాయని శారదా ఆకునూరి తదితర స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాట్స్ హ్యూస్టన్ విభాగం విరాళాలు ప్రకటించిన దాతల్లో ప్రతి ఒక్కరికి ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపింది.
|
|
|
|
|
|