To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
17 October 2018
USA
తిత్లీ బాధితులకు నాట్స్ ముమ్మర సహాయ కార్యక్రమాలు
రండి.. తిత్లీ బాధితులను ఆదుకుందాం..: నాట్స్ పిలుపు
పలాస: అక్టోబర్17: శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సంకల్పించింది..తిత్లీ దెబ్బకు కకావికలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాలని నాట్స్ శ్రేణులకు పిలుపునిచ్చింది..గతంలోనూ హుద్ హుద్ సమయంలో దెబ్బ తిన్న విశాఖ కోసం నాట్స్ తన వంతు సాయం చేసింది.దీంతో పాటు విశాఖ పచ్చదనం పునరుద్ధరణలో మొక్కలు నాటడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంలో నాట్స్ ఆర్థిక సాయం చేసింది.ప్రస్తుతం తిత్లీ బాధితులను ఆదుకునేందుకు కూడా నాట్స్ శరవేగంగా స్పందిస్తోంది. నాట్స్ చాప్టర్లతో సంప్రదించి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది. అమెరికాలో ఉండే తెలుగువారు.. సాటి తెలుగువారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది..విరాళాలు ఇచ్చేందుకు నాట్స్ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చని తెలిపింది. మరో వైపు శ్రీకాకుళం తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస మంచికలపూడి పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మందికిపైగా నాట్స్ వాలంటీర్లను పంపించారు. తీత్లీ బాధితులకు నిత్యావసర వస్తువులు, చీరలు,దుప్పట్లు అందించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. స్థానిక గ్లో పౌండేషన్ నాట్స్ కు తన సహాయ సహకారాలు అందిస్తోంది. ఐదు వేల ఆహార పొట్లాలను సిద్ధం చేసి బాధితులకు అందిస్తోంది. ఎప్పటికప్పుడు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అమెరికా నుంచే నాట్స్ సభ్యులు వాలంటీర్లతో మాట్లాడుతూ నాట్స్ తరపున సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నారు.
రేపటినుండి శ్రీకాకుళం లోని మరో 7 గ్రామాలకు నాట్స్ సేవలందించనుంది.
దాతలు ఈ క్రింది నాట్స్ వెబ్ సైట్ ద్వారా విరాళాలు పంపవచ్చు.
https://www.natsworld.org/donate-now/