To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 October 2018
USA
సోమర్సెట్: న్యూ జెర్సీ: అక్టోబర్ 18: “అమెరికాలో షిరిడీ” నిర్మాణానికి కీలకమైన ఘట్టం మొదలైంది. అమెరికాలో సాయి భక్తుల కోసం న్యూజెర్సీలో సాయి దత్త పీఠం భూమి పూజతో అమెరికాలో షిరిడీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయదశమి మరియు బాబా వారి 100 సం. ల పుణ్య తిధి సందర్భంగా సాయిదత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితుడు బైరవ మూర్తి ల ఆధ్వర్యంలో ఈ భూమి పూజ జరిగింది. వేద మంత్రాల మధ్య భూమి పూజను వేదపండితులు పూర్తి చేశారు.. అమెరికాలో షిర్డీ దేవాలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా జరగనుంది. హిందు సాంప్రదాయక జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా ఈ “అమెరికా లో షిరిడీ” నిర్మాణం జరగనుంది. ఈ ఆలయం అచ్చం షిరిడీ ని పోలి ఉండేలా రూపుదిద్దనున్నారు ముంబయి కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్.
స్థల దాతలు, నిర్మాణ దాతల వివరాలను ఆలయ గోడల మీద లిఖియించటం జరుగుతుంది. దాతలతో పాటు ప్రత్యేక విరాళాలిచ్చే దాతల కుటుంబసభ్యుల పేర్లను ఈ గోడలపై చెక్కిస్తారు. గురుస్థానం, లెండివనము, ద్వారకామాయి, నిత్య ధుని, చావడి సదుపాయాన్ని ఈ ఆలయంలో కూడా నిర్మించనున్నారు.
బాబా వారి శతసంవత్సర సమాధి సమయ సందర్భంగా, ఫ్రాంక్లిన్ టౌన్ షిప్ వారి పరిమిత పర్మిషన్స్ నడుమ, విజయదశమి నాడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ హాజరయ్యారు.