To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
28 March 2018
Germany
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం అంతటా ఎంతో గొప్పగా జరుపుకునే ఉగాది పండుగను జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరం లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది అక్కడి ఏకైక తెలుగు సంస్థ అయిన తెలుగు వెలుగు జర్మనీ అసోసియేషన్. మార్చ్ 24 వ తేదీన ఫ్రాంక్ఫర్ట్ లో ని సోస్సెన్ హైం ఆడిటోరియం లో ఉగాది సంబరాలు నింగి ని తాకే స్థాయిలోజరిగాయి. ముఖ్య అతిధి స్థానిక ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ అయిన శ్రీమతి ప్రతిభ పార్కర్ గారు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమం ప్రారంభంచేసారు . ఫ్రాంక్ఫర్ట్ నగర పురపాలక ప్రతినిధి అయిన శ్రీ మోబిస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని సంస్థ కమిటీ ని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలని కొనియాడారు.
టాలీవుడ్ ప్రముఖ గాయకులు శ్రీ ధనుంజయ్ గారు మరియు శ్రీమతి సాయి శిల్ప గారు వారి గాన ప్రదర్శన తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. నాసికాగ్రనాధ భూషణ శ్రీ సాయి హేమంత్ కృష్ణ తన నాసికావేణుగానం తో అందరిని మంత్రముగ్ధుల్ని చేశారు. నాట్య శిరోమణి శ్రీమతి నదియా గారు వారి అమోఘమైన నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. అనేక సాంస్కృతిక సాంప్రదాయ మరియు చిత్ర నృత్య కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ , ఇండియన్ డాన్స్ అకాడమీ , ఉజ్వల డాన్స్ గ్రూప్ మరియు ఫ్రాంక్ఫర్ట్ గర్ల్స్ వారు ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు.
స్థానికంగా ఎంతో పేరుపొందిన రుచి రెస్టారెంట్ వారు భోజన సదుపాయాలు చేశారు. కార్యక్రమ దాతలు ఐన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్సడ్ సాఫ్ట్వేర్, జవాజి సాఫ్ట్వేర్, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్ మరియు పి.జె. ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల శ్రీ సాయి రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది.