మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో.. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన చిత్రం `సంజీవవని`. ఈ చిత్రం జూన్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ - ``తక్కువ బడ్జెట్లో సంజీవని వంటి సినిమా చేయడం అసాధ్యమని సినిమా చూసిన వారు ఎవరైనా అంటారు. కానీ మేం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం. దీనికి కారణం అందరూ ఓ టీంగా పనిచేయడమే. తెలుగు సినిమాను హలీవుడ్ స్థాయిలో తీశాం. సొంతంగా గ్రాఫిక్ స్టూడియో నిర్మించుకోవడమే కాదు.. కెనడా, హైదరాబాద్లోని కొన్ని వి.ఎఫ్.ఎక్స్ స్టూడియోల సహాయంతో సినిమాను పూర్తి చేశాం. రెండు సంత్సరాలు పాటు కష్టపడ్డాం. 1000కి పైగా వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అన్ని వర్గాలకు నచ్చే ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది`` అన్నారు.
అనురాగ్ దేవ్ మాట్లాడుతూ - ``రెండేళ్ల పాటు యూనిట్ అంతా ఎంతో కష్టపడి చేసిన సినిమా. షూటింగ్ కంటే వి.ఎఫ్.ఎక్స్కే ఎక్కువ సమయం పట్టింది. మా ట్రైలర్ చూసి రాజమౌళిగారు, రామ్గోపాల్ వర్మగారు ట్వీట్ చేశారంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం చచేసుకోవచ్చు. అంత పెద్ద దర్శకులు మా యూనిట్ను అభినందించారు. దీంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. దాని వల్ల కాస్త భయం కూడా ఏర్పడింది. అయితే సినిమాపై మేం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం`` అన్నారు.
మోహన్ భగత్ మాట్లాడుతూ - ``కొత్తవాళ్లమైన మాతో ఇలాంటి ఓ మంచి సినిమాను చేసిన రవి వీడేగారికి థాంక్స్`` అన్నారు.
పూర్ణేష్ మాట్లాడుతూ - ``ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా`` అన్నారు.
దేవిప్రసాద్ మాట్లాడుతూ - ``రవిగారితో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది`` అన్నారు.
శ్వేతా వర్మ మాట్లాడుతూ - ``ఇందులో అందరం పర్వాతారోహకులుగా కనపడతాం. సంజీవని మొక్క కోసం వెళ్లిన అందరికీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే సినిమా`` అన్నారు.
ఈ కార్యక్రమంలో తనూజ, నితిన్నాశ్ తదితరులు పాల్గొన్నారు.