ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం 'అంతకు మించి'. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 24న విడుదలవుతుంది. ఈసినిమా టైటిల్ సాంగ్ను సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు జానీ మాట్లాడుతూ ``దర్శకుడిగా నా తొలి చిత్రమిది. సినిమా పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ ఎక్స్పోజింగ్ గురించచే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. హీరో జై గారు.. నిర్మాతగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నటన పరంగా క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఈ సినిమాతో మంచి నటుడిగాపేరు తెచ్చుకుంటారు. సునీల్గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అంతకు మించిఆర్.ఆర్ని అందించారు. సినిమా రిలీజ్ తర్వాత ఆర్.ఆర్ గురించి.. కెమెరా వర్క్ గురించి మాట్లాడుకుంటారు`` అన్నారు.
హీరో..నిర్మాత జై మాట్లాడుతూ`` సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. ఆమె వల్లనే సినిమాకు హైప్ వచ్చింది. సినిమా చాలాబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. నైజాంలో వంద థియేటర్స్లో సినిమా విడుదలవుతుంది. 100 శాతం కచ్చితంగా సక్సెస్ అవుతుంది`` అన్నారు.
హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ`` సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. జై హీరోగా, నిర్మాతగా అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా కేక్లా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. 24న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.