pizza
TANA Volunteers appreciation.
తానా వాలంటీర్ కు సన్మానం, ద్విచక్ర వాహనం బహుమతి.
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

11 December -2020
USA

గత పదేళ్లుగా కర్నూలు జిల్లాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యక్రమాల్లో వాలంటీర్ గా సేవలందించిన కర్నూలుకు చెందిన ప్రకాష్ రాజుకు తానా కార్యదర్శి పొట్లూరి రవి హోండా ప్లెజర్ ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందించారు. బుధవారం వంశి సంస్థల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూల్ సిఐ (సీఐడి) డేగల ప్రభాకర్ శాలువాతో సత్కరించి ద్విచక్ర వాహనాన్ని అందించారు.

తానా, కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో సహకారంతో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో 75 రోజులపాటు, తుంగభద్రా పుష్కరాల్లో 12 రోజుల పాటు ఆహారం అందించారు. జిల్లాలో తుంగభద్ర వరదల సమయంలో, కప్పట్రాళ్ళ గ్రామాభివృద్ధిలో, వివిధ కార్యక్రమాల్లో తానా సహకారం అందించింది. తానా వంటి లాభాపేక్ష లేకుండా పని చేసే సంస్థల కార్యక్రమాల్లో వాలంటీర్లు (స్వచ్చంద సేవకులు) కీలకపాత్ర పోషిస్తారని, సంస్థల మనుగడకు సభ్యుల, దాతల సహకారంతో పాటు క్రమశిక్షణ, అంకిత భావం కలిగినటువంటి వాలంటీర్లు వెన్నుముకలాంటివారని, ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా కమిటీ చైర్ రామ్ చౌదరిని అభినందిస్తున్నట్లు తానా అధ్యక్షులు జై తాళ్లూరి, ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖ సహకారంతో అవగాహనా శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూధన్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సహకారంతో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో 75 రోజులపాటు, తుంగభద్రా పుష్కరాల్లో 12 రోజుల పాటు ఆహారం అందించారు. జిల్లాలో తుంగభద్ర వరదల సమయంలో, కప్పట్రాళ్ళ గ్రామాభివృద్ధిలో, వివిధ కార్యక్రమాల్లో తానా సహకారం అందించింది. తానా వంటి లాభాపేక్ష లేకుండా పని చేసే సంస్థల కార్యక్రమాల్లో వాలంటీర్లు (స్వచ్చంద సేవకులు) కీలకపాత్ర పోషిస్తారని, సంస్థల మనుగడకు సభ్యుల, దాతల సహకారంతో పాటు క్రమశిక్షణ, అంకిత భావం కలిగినటువంటి వాలంటీర్లు వెన్నుముకలాంటివారని, ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా కమిటీ చైర్ రామ్ చౌదరిని అభినందిస్తున్నట్లు తానా అధ్యక్షులు జై తాళ్లూరి, ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖ సహకారంతో అవగాహనా శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూధన్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved