pizza
Teeyani Kalavo music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 April 2014
Hyderabad

తీయని కలవో' ఆడియో లాంఛ్ విశేషాలు

అఖిల్ కార్తీక్, శ్రీ తేజ, హుదుషా నటీనటులుగా శివకేశవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బలమూరి రామమోహన్ రావు నిర్మించిన చిత్రం 'తీయని కలవో'. శివాజీ.యు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవీంద్ర ప్రసాద్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుక నేడు (20.4) హైదరాబాద్ లోని రాక్ హైట్స్ లో జరిగింది.

ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న సుధీర్ బాబు, నవీన్ చంద్ర ఆడియో సీడీలను ఆవిష్కరించి, మరో ముఖ్య అతిధి శ్రీవాస్ కు ఇచ్చారు.

థియేట్రికల్ ట్రైలర్ ని నిర్మాత రామమోహన్ రావు బాల్య స్నేహితులు ఆవిష్కరించారు.

అనంతరం శ్రీవాస్ మాట్లాడుతూ - ''నా రెండో చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ'లో ఓ కీలక పాత్ర చేశాడు. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్నయినా సింగిల్ టేక్ లో చేసేవాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్స్ చూస్తుంటే సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రదర్శకుడు అంతకుముందు కొరియోగ్రాఫర్ గా చేశాడు కాబట్టి, పాటలను స్టయిలిష్ గా తీసి ఉంటాడనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.

'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' ఫేం రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ''టీమ్ వర్క్ తో ఈ సినిమా చేశాం. పాటలు బాగా వచ్చాయంటే నిర్మాతే కారణం. ఆయనకు మంచి అభిరుచి ఉంది. ఈ పాటలు, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శివాజీ మాట్లాడుతూ - ''మంచి పాటలిచ్చినందుకు రవీంద్రకు ధన్యవాదాలు.అఖిల్ కార్తీక్ ని కొత్త కోణంలో చూపించాను. శ్రీ తేజను లవర్ బోయ్ లా చూపించాను. నాకు జన్మనిచ్చినది మా అమ్మానాన్నలైతే, ఈ సినిమాకి అవకాశం ఇవ్వడం ద్వారా నిర్మాత నాకు పునర్జన్మనిచ్చారు. అందరి మనసులను హత్తుకునే తియ్యని కల లాంటి ప్రేమకథా చిత్రం ఇది'' అన్నారు.

చిత్రకథకుడు, నిర్మాత రామ మోహన్ రావు మాట్లాడుతూ - ''ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ వారు ఈ ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. వంద శాతం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.

అఖిల్ కార్తీక్ మాట్లాడుతూ - ''నేను నటించిన ఓ సినిమాకి ఈ చిత్రదర్శకుడు కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత ఒక రోజు ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమాని చాలా క్వాలిటీగా తెరకెక్కించాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమా రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది'' అన్నారు.

ఈ వేడుకలో దామోదర్ ప్రసాద్, సురేష్ కొండేటి, శివాజీ రాజా, ఖయ్యూమ్, సాయికార్తీక్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved