
25 August 2025
Hyderabad
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. డైరెక్టర్ సృజన్ ఈ సినిమా చూడమని చాలా రోజులుగా అడిగారు. తర్వాత మధు శాలిని గారు ఈ సినిమా గురించి చెప్పారు. మధు శాలిని గారు సినిమాలో సంపాదించి మళ్లీ సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కచ్చితంగా ఇలాంటి ఒక మంచి టీం కి సపోర్ట్ చేయాలని అనిపించింది. ఈ సినిమా చూశాను. చాలా హానెస్ట్ సినిమా. మంచి స్క్రీన్ ప్లే తో లైటర్ వెయిన్ ట్రీట్మెంట్ తో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పంట పొలాలతో ఒక ప్రేమ కథని ముడి పెడుతూ చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. సినిమా స్క్రీన్ ప్లే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గీత్ సైని చాలా అద్భుతంగా నటించింది. తన క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ చాలా క్యూట్ గా కనిపించారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ పెయిర్ ఇది. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి థియేటర్లో రిలీజ్ చేస్తానని చెప్పడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా నాకు చాలా నచ్చింది. చాలా హార్డ్ వర్క్ తో చేసిన సినిమా. సృజన్ ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తున్న మధుగారికి థాంక్యూ. చాలా ఈ సినిమా నాకు నచ్చింది. ఇంత మంచి సినిమాకి హెల్ప్ చేయాలని సపోర్ట్ చేయాలని ముందుకు వచ్చాను. గత నాలుగు రోజులుగా ఈ సినిమాకి ఈ సినిమాని చూసి నాకు చాలా మంది ఫిలిం మేకర్స్ చాలా బాగుందని చెఫ్తున్నారు. వారందరికీ థాంక్యూ.
డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మొదలైనప్పుడే బన్నీ వాసు గారికి చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను. కచ్చితంగా కథలోని కొత్తదనానికి ఆయన ప్రోత్సహిస్తారు అని నమ్మకం ఉండింది .చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు. లక్కీగా ఆ ప్రాసెస్ లో మధు వచ్చారు. మధుగారు ద్వారా ఈ సినిమాని బన్నీ వాసు గారికి చూపించగలిగాము. ఆగస్టు 27న రిలీజ్ అవుతుంది అంటే కారణం బన్నీ వాస్ గారు. ఆయన సపోర్ట్ వల్లే మేము రిలీజ్ చేయగలుగుతున్నాము. కంటెంట్ నమ్మి సినిమా తీశాము. బన్నీ వాసు గారికి ఈ సినిమా నచ్చడం ఆయన రిలీజ్ చేయడం మా మొదటి సక్సెస్ గా భావిస్తున్నాం. ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది.ఆడియన్స్ అందరికి కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాం.
మూవీ ప్రజెంటర్ మధుశాలిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా చూసినప్పుడే నాకు కచ్చితంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలనిపించింది. డైరెక్టర్ గారి ప్యాషన్ డెడికేషన్ ఆ జర్నీ అంత విన్న తర్వాత నేను ఈ మాత్రమైనా చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వృధా అనిపించింది. ఇంత మంచి సినిమాతో అసోసియేట్ కావడం, బన్నీ వాసు గారు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు గారికి థాంక్ యూ. డైరెక్టర్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా తీశారు. మధుశాలిని గారికి థాంక్ యూ. తప్పకుండా ఆగస్టు 27న ఈ సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరో శ్రీ చరణ్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. మా సినిమాని రిలీజ్ చేస్తున్న బన్నీ వాస్ గారికి థాంక్ యూ. డైరెక్టర్ సృజన్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. సినిమా బ్యూటిఫుల్ గా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది.
