| 
             
 
                 | 
                
              
  
    | 
      
        
           
        18 April 2015 
          Hyderabad 
        మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవిని గెల్చుకున్నారు. తన ప్యానెల్ లో నిలబడి, విజేతలైన శివాజీరాజా, కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరామ్ తదితరులతో పాటు నటుడు ఉత్తేజ్ తో సహా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు రాజేంద్రప్రసాద్. శనివారం సాయంత్రం 5 గంటలకు చిరంజీవి స్వగహానికి వెళ్లారు. 'మా' నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఆయన సహచరులను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు అందజేశారు. అలాగే, విజేతలకు పుష్పగుచ్ఛాలిచ్చి, శాలువాతో సత్కరించారు. 
          
          
      
      
 
      
  
       | 
   
  
    Photo 
      Gallery (photos by G Narasaiah)  | 
   
  
     | 
   
                | 
                
                
 
            
                 | 
                 
               
            
         
            
             
          | 
             
        
        |