pizza
Vishnu - Raj Tharun film launch
విష్ణు, రాజ్‌తరుణ్‌ నూతన చిత్రం ప్రారంభం

You are at idlebrain.com > News > Functions
Follow Us

13 December 2015
Hyderabad

మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ నటీనటులుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నం:5 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విష్ణుకి 'దేనికైనా రెడీ' వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ టీవీ సమర్పణలో సుంకర రాంబ్రహ్మం నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి డా.మోహన్‌బాబు క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి నిర్మల కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మంచు మనోజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ''నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిది. సోమవారం నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు.

నటీనటులు-సాంకేతిన నిపుణులు:
రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved