pizza
TCA and Sri Mitra donate cheque to CM
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 December 2014
Hyderabad

ఉత్తరాంధ్ర హుద్ హుద్ బాధితులకు టీసీఎ 71 లక్షలు విరాళం

ఉత్తరాంధ్ర హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు ఇటీవల విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. గత ఆదివారం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (టీసీఎ) మరియు శ్రీమిత్ర సంయుక్తంగా ఈ మ్యాచ్ నిర్వహించాయి.

ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన 71 లక్షల రూపాయలను ఈ రోజు (19.12.) సాయంత్రం సచివాలయంలో 6 గంటల 15 నిమిషాలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర ఎండి చౌదరి, టీసీఎ సభ్యులు శ్రీకాంత్, తరుణ్, సుశాంత్, అజయ్, నంద కిశోర్, నవీన్ చంద్ర, ఖయ్యూమ్, కార్తీక్, విశ్వ, రఘు, ఫిజియో వెంకట్ మరియు విజయ్, చంటి, రవిప్రకాశ్, రఘు తదితర నటులు పాల్గొన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved