pizza
Telugu Film Producers Council elects new Executive Committee
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 July 2016
Hyderabad

తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి కొత్త కార్య‌వ‌ర్గం ఎన్నికైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

దేవేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ``గ‌త మండ‌లి అధ్య‌క్షుడుగా ఎన్నికైన ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌ను దించేవేశాం. ఇటీవ‌ల జ‌రిగిన మీటింగ్‌లో 15 మంది పాల్గొన‌గా 14 మంది ఏక‌గ్రీవంగా స‌త్యారెడ్డిని అధ్య‌క్షుడిని ఎన్నోవ‌డం జ‌రిగింది. అందుకు త‌గిన విధంగా కొత్త క‌మిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందులో శంక‌ర్ గౌడ్‌, వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్ వైస్ ప్రెసిడెంట్ కాగా ప‌ద్మిని, పోతుల కిషోర్‌లు సెక్ర‌ట‌రీలు వ‌ర్క్ చేస్తారు. ఈ కార్య‌వ‌ర్గాన్ని విజ‌య‌వాడ‌లోని ఎల‌క్ష‌న్ క‌మిటీకి పంపి వారు ఆమోదం తీసుకోవాల్సి ఉంది`` అన్నారు.

బ‌సిరెడ్డి మాట్లాడుతూ ``కొత్త క‌మిటీ ఎన్నికైంది. 20 మంది స‌భ్యులుంటే అందులో 14 మంది మాత్ర‌మే ఓటింగ్‌లో పాల్గొన్నారు. త‌రువాత మీటింగ్ నుండి ఈ కొత్త కార్య వ‌ర్గం బాధ్య‌త‌లు చేప‌డుతుంది.

న‌ట్టికుమార్ మాట్లాడుతూ ``అవిశ్వాస తీర్మానం ద్వారా పాత అధ్య‌క్షుడి స్థానంలో స‌త్యారెడ్డిని అధ్య‌క్షుడిగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది. ఈయ‌న అధ్య‌క్ష‌త‌న కొత్త కార్య‌వ‌ర్గం ప‌నిచేస్తుంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, స‌త్యారెడ్డి, శంక‌ర్ గౌడ్‌, వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్‌, ప‌ద్మిని, పోతుల కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved