pizza
Oopiri trailer launch
‘ఊపిరి’ ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 March 2016
Hyderabad

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమా ట్రైలర్ ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన నాగచైతన్య, అఖిల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

నాగచైతన్య మాట్లాడుతూ ‘’ట్రైలర్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంది. అలాగే నాన్నగారు యంగ్ అయిపోతున్నారు. మేం ఓల్డ్ అయిపోతున్నామనే ఆలోచన వచ్చేస్తుంది. వంశీ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. తను చేసిన మరో కొత్త ప్రయత్నం. ఇలాంటి సినిమా చేయాలంటే పివిపిగారి లాంటి నిర్మాతే సరైన వ్యక్తి. ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ వచ్చుంటుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

అక్కినేని అఖిల్ మాట్లాడుతూ ‘’ట్రైలర్ చాలా బావుంది. మా నాన్నగారు రెండు సంత్సరాలుగా చేసిన ఎమోషనల్ జర్నీ. ట్రైలర్ చూస్తుంటే ఆ డెప్త్ తెలుస్తుంది. అసలు ఈ సినిమాలో నాన్నగారి లాంటి హీరో కుర్చీలో కూర్చొవడమేంటని అనుకుని నేనైతే వద్దని అన్నాను. కానీ నాన్నగారు కొత్తగా ఉంటుందని చేశారు. వంశీ సినిమాను బ్యూటీఫుల్ గా తెరకెక్కించాడు. అలాగే మనం సినిమాను బ్యాక్ బోన్ గా నిలిచిన పి.ఎస్.వినోద్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచాడు. సినిమాలో హై స్టాండర్డ్ విజువల్స్ కనపడుతున్నాయి. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు నాన్నగారికి, కార్తీకి, అలాగే వంశీ, వినోద్ కు మధ్య ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. సినిమా కూడా అందరికీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ ‘’ఈ సినిమాను మార్చి 2014లో స్టార్ట్ చేశాం. ఇప్పటికీ రెండేళ్ళ జర్నీ అవుతుంది. నాగార్జుగారికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే మా బ్యానర్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీ అవుతుంది. తెలుగు, తమిళంలో కలిపి 60కోట్ల ఖర్చుతో పారిస్, బెల్జియం వంటి దేశాల్లో సినిమాను షూట్ చేశాం. వరల్డ్ క్లాస్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. మాస్ డైరెక్టర్ వంశీ క్లాస్ గా తీసిని మూవీ ఇది’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’మేం చేసిన కొత్త ప్రయత్నమీ చిత్రం. నాగార్జునగారు, కార్తీగారు, పివిపి అన్న నమ్మకమే ఊపిరి. ఇలాంటి విజువల్స్ ఉన్న సినిమా చేయాలంటే గట్స్ ఉన్న నిర్మాత కావాలి. అది పివిపిగారికే సాధ్యమైంది. పారిస్ లాంటి కాస్ట్ లీ సిటీలో 12 రోజుల పాటు షూటింగ్ చేశారు. చాలా కొత్తగా చూపించాం. అందరికీ మెమొరబుల్ జర్నీ. సమ్మర్ లో విడుదలవుతున్న తొలి సినిమా. బ్రీత్ ఆఫ్ రిలీఫ్. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. చాలా ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ ‘’అప్పుడప్పుడు బాధపెడుతూ, మనసు మెళిక పెడుతూ కన్నీళ్ళు వచ్చేస్తాయనుకునే లోపు నవ్వించే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.

హరి మాట్లాడుతూ ‘’ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ. ప్రతి పాత్ర మనసుకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved