pizza

“The Real Heroes of ‘Vishwanath & Sons’ Are the Audiences”: Trivikram Srinivas
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

You are at idlebrain.com > news today >

15 August 2026
Hyderabad

Tamil star Suriya’s latest outing, ‘Vishwanath & Sons’, directed by talented filmmaker Venky Atluri, has opened to an overwhelming response from audiences across the country. Mamitha Baiju plays the female lead, while Radhika Sarathkumar and Raveena Tandon appear in pivotal roles.

Presented by Srikara Studios and produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, the film features music by G. V. Prakash Kumar.

Released worldwide on August 14, 2026, ‘Vishwanath & Sons’ has emerged as a heartwarming family entertainer, winning appreciation for its natural humour, sensitive emotions, strong writing and impressive performances. The film is receiving a tremendous response from audiences and is registering strong collections at the box office.

Celebrating the film’s success, the team organised a grand success press meet at ITC Kohenur, Hyderabad, where the cast and crew expressed their happiness and thanked audiences for their overwhelming support. Renowned filmmaker and ‘Maatala Mantrikudu’ Trivikram Srinivas attended the event as the chief guest.

Trivikram Srinivas : Speaking at the success meet, Trivikram Srinivas said, “Greetings to everyone. From the time I heard this story, the film has been very close to my heart. I congratulate the entire team for making and successfully presenting a family film at a time like this.

“I want to make a film with Suriya sir. I haven’t yet narrated a story that he has liked (laughs). I believe we will work together very soon. My wife is a huge fan of Suriya sir. She doesn’t just request me to make a film with him, she demands it! She normally doesn’t visit film sets, but because of her admiration for Suriya sir, she visited this film’s set and took a picture with him.

“There are very few heroes whom women admire so deeply. Once they like someone, they never let go. Suriya sir is one such hero. In India, there are only two heroes whose age seems to go backwards — Suriya sir and Mahesh Babu sir.

“Sanjay Ramaswamy from Ghajini is a character that became very close not only to Tamil audiences but also to Telugu audiences. Some characters travel with us for decades, and that is one such character. When the Hindi version of Ghajini was made, Aamir Khan sir himself admitted that he could not match Suriya sir. Allu Aravind garu told me this while we were making Jalsa.

“Venky deserves a huge round of applause for the effort he put into bringing that look back, both in writing and execution. He has written the film beautifully. When I watched the edited version, I felt that some scenes would remain iconic in the future.

“There are four pillars to this film. One is Suriya sir, another is Radhika garu, the third is Raveena Tandon garu and the fourth is Mamitha Baiju garu. I have seen KGF and I also know Raveena garu personally. She appears very strong and dynamic in real life, but she has played a surprisingly different role here. She performed it with great naturalness. It may look easy to the audience, but I know how difficult such a role is to perform.

“Mamitha has brought tremendous energy to her character. Suriya sir’s character is extremely difficult. You cannot overplay it even slightly. Underplaying a character is much harder, and Suriya sir performed it brilliantly.

“I am happy that our production house is associated with a Suriya film. But I will be even happier when my name appears as the director of a Suriya film.

“In the span of one year, Suriya sir has done two completely different films like Karuppu and Vishwanath & Sons. It feels like a new journey has begun for him. He is travelling with us and giving us countless memories.

“Humility is one of the biggest things we should learn from Suriya sir. I have immense respect for his father, Sivakumar sir. We consider Suriya sir and Karthi sir as Telugu heroes too.

“Today, there are no boundaries between Tamil cinema, Telugu cinema and Hindi cinema. All languages have come together as Indian cinema. This is the time for Indian cinema to showcase its strength on the global stage, and all of us are working in that direction.

“My best wishes to Venky, Vamsi and the entire team. The real heroes of this film are the audiences. On behalf of all of us, I thank everyone who is showering love on ‘Vishwanath & Sons’.”

Suriya : Suriya said, “Words are not enough to thank you for the love you are showing us. I am extremely happy that Trivikram garu has come to this celebration. His presence has made this occasion even more special.

“This film became possible because of Trivikram garu’s blessings, love and support. I will never forget my journey with Sithara Entertainments. I hope to do more films with Naga Vamsi garu and create many more beautiful memories together.

“Venky and Vamsi garu are from Telangana/Andhra, I am from Tamil Nadu, Mamitha is from Kerala and Raveena garu is from Maharashtra. We all came from different regions and speak different languages, but we came together to make a good film, and you are embracing it.

“By showering so much love on this film, audiences have given family entertainers a new life. We are receiving an incredible response from every region. The love and respect audiences are showing towards this film are truly special.

“This film has once again reminded all of us how important the family genre is. Trivikram garu has been a great inspiration when it comes to family films.

“My heartfelt thanks to Venky Atluri for delivering such a wonderful film. Some films cannot be measured only by box-office numbers. The real success of a film lies in the experience it gives the audience. Hats off to Venky’s writing. I would also like to extend my special thanks to the Telugu audience.”

Raveena Tandon : Raveena Tandon said, “It is a great pleasure to be part of the success celebration of ‘Vishwanath & Sons’. My heartfelt thanks to the audiences who showered love on the film and made this success possible.

“Venky Atluri is a wonderful director. He is humble and loving, and he knows how to bring out the best in everyone. This is a beautiful film filled with emotions, and congratulations to Venky for delivering such a wonderful movie.

“The shoot felt like a picnic and was a lot of fun. Suriya sir has tremendous craze. My friends used to come to the sets just to meet him! I feel fortunate to have acted alongside Radhika garu.

“My congratulations to Naga Vamsi garu, who stood like a backbone for the entire team and delivered such a wonderful film.”

Venky Atluri : Director Venky Atluri said, “First and foremost, my heartfelt thanks to the audiences. When I wrote this story, the trend was completely different. Action, dark humour, horror and devotional films were dominating the industry. At such a time, if you say you want to make a family film, people may discourage you. But Vamsi garu never did that.

“Trivikram garu also encouraged me tremendously. This would not have been possible without his support. The moment Trivikram garu took this film as his own, everything started falling into place.

“Distributors telling us that the collections on the second day were double compared to the first day made me extremely happy. I have heard of collections increasing by 30 or 40 percent, but this is the first time in my career that I have seen collections double.

“Everyone is saying that I wrote the film well, but Suriya sir carried this film on his shoulders. The entire credit for these phenomenal collections goes to him.

“My heartfelt thanks to every single person who has been part of this film.”

The film’s distributors also attended the event and expressed their happiness over the phenomenal box-office performance of ‘Vishwanath & Sons’. Actors Sunil Reddy, Viva Harsha, fight master Venkat and other members of the team were also present and shared their joy over the film’s success.

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం.

ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు దశాబ్దాల పాటు ప్రయాణిస్తాయి. అలాంటి పాత్ర అది. హిందీ గజినీ చేసిన సమయంలో 'నేను సూర్యను మ్యాచ్ చేయలేకపోయాను' అని స్వయంగా అమీర్ ఖాన్ గారు ఒప్పుకున్నారు. జల్సా సినిమా చేసేటప్పుడు ఈ విషయం నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు. ఆ లుక్ ని మళ్ళీ తీసుకురావడం కోసం వెంకీ పడిన కష్టానికి, అది రాయడంలో గానీ, తీయడంలో గానీ హ్యాట్సాఫ్. వెంకీ చాలా బాగా రాశారు. ఎడిట్ లో చూసిన సమయంలోనే నాకు అనిపించింది.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు భవిష్యత్తులో ఐకానిక్ సీన్స్ గా మిగిలిపోతాయి. ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ సూర్య గారైతే, ఇంకో పిల్లర్ రాధిక గారు, మూడో పిల్లర్ రవీనా టాండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. నేను కేజీఎఫ్ చూశాను, అలాగే బయట కూడా నాకు రవీనా గారు తెలుసు. బయట స్ట్రాంగ్ గా, డైనమిక్ లేడీలా కనిపిస్తారు. కానీ, ఇందులో ఆశ్చర్యకర పాత్ర పోషించారు. చాలా సహజంగా నటించారు. చూసే వారికి అది తేలికగా అనిపించవచ్చు కానీ, ఆ పాత్ర పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. మమితా పాత్రకు తగ్గట్టుగా ఎంతో ఎనర్జిటిక్ గా చేశారు. ఇక సూర్య గారిది చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. కొంచెం కూడా ఎక్కువ చేయకూడదు. అలా అండర్ పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలో సూర్య గారు అద్భుతంగా నటించారు. సూర్య గారి సినిమా నిర్మాణంలో మా ప్రొడక్షన్ పేరు కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ, సూర్య గారి సినిమాకి దర్శకుడిగా నా పేరు పడినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. ఒక్క ఏడాది వ్యవధిలో కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి రెండు పూర్తి విభిన్న సినిమాలు చేశారు. సూర్య గారు ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. మనతో ప్రయాణిస్తున్నారు, మనకు ఎన్నో ఙ్ఞాపకాలు ఇస్తున్నారు. సూర్య గారి నుంచి నేర్చుకోవాల్సింది వినయం. సూర్య తండ్రి గారు (శివకుమార్) అంటే నాకెంతో గౌరవం. సూర్య గారు, కార్తీ గారిని తెలుగు హీరోలుగా భావిస్తాం. ఇప్పుడు తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అనే హద్దులు లేవు. ఇప్పుడు అన్ని భాషలు కలిపి ఇండియన్ సినిమా అయింది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటాల్సిన సమయం ఇది. ఆ దిశగానే మేమందరం పని చేస్తున్నాం. వెంకీ, వంశీ సహా టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా అందరి తరపున కృతజ్ఞతలు." అన్నారు.

కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. "మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చాము, విభిన్న భాషలు మాట్లాడతాం. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాము. దానిని మీరు ఆదరిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ.. ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ప్రేమను, గౌరవాన్ని చూపిస్తున్నారు. మా అందరికీ ఫ్యామిలీ జానర్ ఎంత ముఖ్యమో మళ్ళీ తెలియజేసింది ఈ సినిమా. ఫ్యామిలీ సినిమాల విషయంలో త్రివిక్రమ్ గారి స్పూర్తి ఎంతో ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు. కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేము. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. వెంకీ రచనకు హ్యాట్సాఫ్. అలాగే తెలుగు ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు." అన్నారు.

నటి రవీనా టాండన్ మాట్లాడుతూ.. "విశ్వనాథ్ & సన్స్ సక్సెస్ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ, ఇంతటి విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వెంకీ అట్లూరి గొప్ప దర్శకుడు. వినయంగా, ప్రేమగా ఉంటూ అందరి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటూ ఉంటారు. భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వెంకీకి అభినందనలు. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లాగా, ఎంతో సరదాగా జరిగింది. సూర్య గారికి ఎంతో క్రేజ్ ఉంది. కేవలం ఆయనను కలవడం కోసమే నా ఫ్రెండ్స్ మూవీ సెట్స్ కి వచ్చేవారు. రాధిక గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ వెన్నుముకలా నిలిచి, ఇంత మంచి సినిమాని అందించిన నాగవంశీ గారికి అభినందనలు." అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ముందుగా ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ కథ రాసినప్పుడు ట్రెండ్ ఇది కాదు. యాక్షన్, డార్క్ హ్యూమర్, హారర్, డివోషనల్ లాంటి సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ సినిమా చేస్తానంటే, ఎవరైనా నిరుత్సాహ పరుస్తారు. కానీ, వంశీ గారు అలా చేయలేదు. త్రివిక్రమ్ గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. త్రివిక్రమ్ గారు ఎప్పుడైతే ఈ సినిమాను తనది అనుకున్నారో, ఆ తర్వాత అన్నీ వాటంతట అవే కుదిరాయి. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు రెట్టింపు వసూళ్ళు వస్తున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 30 శాతం, 40 శాతం వసూళ్లు పెరగడం నేను విన్నాను. కానీ, వసూళ్ళు రెట్టింపు అవ్వడం నా కెరీర్ లో మొదటిసారి చూస్తున్నాను. అందరూ నేను బాగా రాశానని అంటున్నారు. కానీ, సూర్య గారు ఈ సినిమాని భుజాల మీద మోశారు. ఈ వసూళ్ళ ఘనత అంతా ఆయనకే దక్కుతుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు." అన్నారు.

ఈ కార్యక్రమానికి చిత్ర పంపిణీదారులు హాజరై, సినిమా సాధిస్తున్న భారీ వసూళ్లపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నటులు సునీల్ రెడ్డి, వైవా హర్ష, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved