pizza
Jai Simha success meet
`జైసింహా` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

22 January 2018
Hyderabad

నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌య‌తార‌, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి న‌టించిన చిత్రం `జై సింహా`. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో డిస్ట్రిబ్యూట‌ర్స్ పార్థసార‌థి రెడ్డి, శివారెడ్డి, ఫ‌ణి, శ‌క్తిపిక్చ‌ర్స్ ర‌మేశ్‌, విజ‌య్‌, మ‌హేశ్‌, కృష్ణ త‌దిత‌రులు పాల్గొని సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ - ``మ‌న సి.క‌ల్యాణ్‌, సివి.రావు గారు నిర్మించిన జైసింహా సినిమా 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. నేను మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు సినిమా కొన్న‌వాళ్ల మ‌ధ్య ఫంక్ష‌న్స్ ఎక్కువ‌గా జ‌రిగేవి. అలాంటి సిచ్యువేష‌న్ ఈరోజు క‌న‌ప‌డుతుంది. ఈవాళ నిర్మాత‌ల ప‌రిస్థితి మ‌న‌కు తెలుసు. కానీ నేను భిన్నంగా నా సినిమాల‌కు నిర్మాత‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తాను. గ‌తంలో నేను క‌ల్యాణ్‌గారితో క‌లిసి ప‌ర‌మ‌వీర‌చ‌క్ర సినిమా చేశాను. ఆ సినిమాకు నేష‌న‌ల్ ఇంటిగ్రిటీ అవార్డు కూడా వ‌చ్చింది. ఇప్పుడు జైసింహా మంచి స‌క్సెస్‌ను సాధించింది. ఈ సక్సెస్‌తో అంద‌రూ సంతోషంగా ఉన్నారు. నాకు రికార్డులు ముఖ్యం కాదు. ఇండ‌స్ట్రీ బావుండాలి. అంద‌రూ సినిమాలు బావుండాల‌ని కోరుకునేవాడిని. అంద‌రి బాగోగుల‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తాను. కె.ఎస్‌.ర‌వికుమార్‌గారితో సినిమా చేయాల‌నే ఎనిమిదేళ్ల క‌ళ ఈ సినిమాతో నేర‌వేరింది. ఇందులో మంచి పాట‌లు, మాట‌లు, సంగీతం ఇలా అన్నీ చ‌క్క‌గా కుదిరాయి.. అందుకే ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞ‌త‌లు`` అన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved