
26 March 2018
Hyderabad
సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్పై రూపొందిన చిత్రం `దిల్లుడు దుడ్డు`. ఈ సినిమాను `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్పై నటరాజ్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ ద్వితీయ వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ట్రైలర్ విడుదల చేశారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``గట్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చునని చెబుతూ ఈ సినిమా టైటిల్ను పెట్టారు. తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. తమిళంలోలాగానే సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ - ``ఏప్రిల్ రెండో వారంలో `దమ్ముంటే సొమ్మేరా` సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది`` అన్నారు.