pizza
Pantham press meet
`పంతం` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


16 June 2018
Hyderabad

 

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వ‌కుశ‌`వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో ఆదివారం ఉద‌యం విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

`పంతం` గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా సంస్థ‌లో ఏడో చిత్రం. గోపీచంద్‌గారు న‌టిస్తోన్న 25వ సినిమా `పంతం`. చాలా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించాం. మేకింగ్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. జులై 5న విడుద‌ల చేస్తామ‌ని మేం ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్ర‌కార‌మే ప్ర‌ణాళిక వేసుకుని చిత్రీక‌రిస్తున్నాం. ఇటీవ‌ల యు.కె.,లండ‌న్‌, స్కాట్లండ్ లో కీల‌క స‌న్నివేశాల‌ను, పాట‌ల‌ను చిత్రీక‌రించాం. ఈ నెల 21న విజ‌య‌వాడ‌లో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్ష‌న్ చేస్తాం. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ టీమ్‌తో చేశాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నేను, మా టీమ్ క‌లిసి మంచి ప్ర‌య‌త్నం చేశాం. సినిమా చాలాబాగా వ‌చ్చింది. జులై 5న విడుద‌ల చేస్తాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాం`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ట్ డైర‌క్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ కూడా పాల్గొన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved